Sat Jan 31 2026 08:35:24 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో విద్యాసంస్థలకు ఈ నెల 30వరకూ సెలవులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల సెలవును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల సెలవును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకూ సెలవులను పొడిగిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు. సంక్రాంతి సెలవులను ఈ నెల 17వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసులు....
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు రెండు వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం సెలవులను పొడిగించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది.
Next Story

