Fri Dec 05 2025 15:55:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్... రైతుభరోసా ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించడంతో రైతు భరోసా నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు బీమాను కూడా అమలు చేస్తామని తుమ్మల తెలిపారు.
రైతు రుణ మాఫీ...
ఏ ఒక్క రైతు అధైర్యపడకుండా ఉండాలని, అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇప్పటికే 25వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్న తుమ్మల, మరో 25 వేల కోట్ల రూపాయలను త్వరలోనే రైతు రుణమాఫీ కింద అందచేస్తామని తెలిపారు. రుణ మాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటన రైతు భరోసాను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడిచంారు. దీంతో త్వరలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవ్వనున్నాయి.
Next Story

