Fri Dec 05 2025 15:00:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ వరద బాధిత మృతులకు ఎక్స్గ్రేషియో పెంపు
నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియో పెంచుతూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరణించిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఒక్కొక్క మృతుడికి వారి కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ఐదు లక్షల రూపాయలు...
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్గ్రేషియోను పెంచాలని నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story

