Telangana : పేదలకు తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మీకొక ఇల్లు వచ్చినట్లే
తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు అందించింది. తెలంగాణలో ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి నిజంగా ఇది శుభవార్త. త్వరలో ఇళ్ల నిర్మాణం మళ్లీ మొదలుకానుంది. రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం మళ్లీ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు ఉపయోగపడనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్రం పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా తన వాటాను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ నిధులను అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుని త్వరగా పూర్తి చేయనుంది.

