Revanth Reddy : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంపై ఫిర్యాదు ఎవరైనా చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. ఏతల్లీ కుమారుడు మరణంపై వివాదం చేయరని అన్నారు. తల్లి చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు. ఆ వివాదంలోకి తనను లాగ వద్దని తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా సక్రమంగా వ్యవహరించాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ కు దిగుతారా? అని నిలదీశారు. మీరు ఏ రాజకీయపార్టీతో అంటకాగుతున్నారో నాకు తెలియదా? అని ప్శ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ముగ్గురి గురించి తనకు అన్నీ తెలుసునని చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి బంద్ పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారో చూద్దాం అని అన్నారు. విడతల వారీగా నిధులు ఇస్తామని, గత ప్రభుత్వం బకాయీలు పెడితే తాము ఏం చేయాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

