Tue Jan 20 2026 19:55:26 GMT+0000 (Coordinated Universal Time)
యాదగిరిగుట్టలో రేవంత్ ప్రత్యేక పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. స్వామి వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సతీసమేతంగా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలను...
స్వస్తి వచనంతో యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాదగిరి గుట్ట నుంచి ముఖ్యమంత్రి భద్రాచలం బయలుదేరి వెళ్లనున్నారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
Next Story

