Wed Feb 19 2025 21:44:18 GMT+0000 (Coordinated Universal Time)
మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేయనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మల్లన్నసాగర్ జలాశయాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మల్లన్నసాగర్ జలాశయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మల్లన్న సాగర్ ను నేడు జాతికి కేసీఆర్ అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అతి పెద్దదిగా మల్లన్నసాగర్ ను నిర్మించారు. దీని పూర్తి సామర్థ్యం యాభై టీఎంసీలు.
సిద్దిపేట జిల్లాలో....
ఈ యాభై టీఎంసీలలో 30 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలను వినియోగిస్తారు. మల్లన్నసాగర్ ఆయకట్టుపరిధిలోని 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టును నేడు కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు.
- Tags
- kcr
- mllanasagar
Next Story