Sat Dec 06 2025 20:48:06 GMT+0000 (Coordinated Universal Time)
రేపు కొత్త సచివాలయంలో తొలిసారి
రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మంత్రివర్గ సమావేశం అందులో జరగనుంది. ఇప్పటి వరకూ కేబినెట్ భేటీలన్నీ ప్రగతి భవన్లోనే జరిగేవి. రేపు కొత్త సచివాయలంలో తొలిసారి మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.
మంత్రివర్గ సమావేశం...
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రి వర్గ సమావేశంలో తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశముంది.
Next Story

