Fri May 17 2024 06:57:29 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని కోసం మృత్యుంజయ హోమం
ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాల కోసం తెలంగాణ బీజేపీ మృత్యుంజయ హోమం నిర్వహించనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాల కోసం తెలంగాణ బీజేపీ మృత్యుంజయ హోమం నిర్వహించనుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మండల స్థాయిలో మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇటీవల పంజాబ్ పర్యటన సందర్భంగా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్ ను ఇరవై నిమిషాలు పాటు నిలిపివేయడంతో ఆయన వెనుదిరిగి వచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా....
ప్రాణాలతో తనను పంపించి నందుకు సీఎంకు థ్యాంక్స అంటూ మోదీ ట్వీట్ చేశారు. అయితే ప్రధాని మోదీ ప్రాణాలకు భద్రత లేదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై తెలంగాణ బీజేపీ శాఖ మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలకాపురిలోని శృంగేరి మఠంలో జరిగే మృత్యుంజయ హోమంలో పాల్గొననున్నారు.
Next Story