దిశ ఎన్కౌంటర్ బూటకం
హైదరాబాద్లో 2019 దిశ ఎన్కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తాజాగా పేర్కొంది. చట్టపరమైన పలు నిబంధనలను, పోలీసు మాన్యువల్ రూల్స్ని అతిక్రమించి ఎన్కౌంటర్ కు పాల్పడినట్లు తేల్చింది ప్యానెల్. దిశ ఎన్కౌంటర్ బూటకమని, పోలీసులు కావాలనే వారిని కాల్చి చంపారని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ పేర్కొంది. పోలీసులు హత్యకు పాల్పడ్డారని ప్యానెల్ తేల్చింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. పోలీస్ మ్యానువల్కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని ఆరోపించింది.