Fri Dec 05 2025 12:26:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ అధికారులకు మహేశ్ బాబు లేఖ
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ రాశారు

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు లేఖ రాశారు. తాను రేపు విచారణకు రాలేనని, షూటింగ్ ఉన్నందున మరొక తేదీని ఇవ్వాలని మహేశ్ బాబు లేఖలో కోరారు. ఇటీవల సినీనటుడు మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు
నోటీసులకు సమాధానం...
ఇటీవల ఈడీ దాడులు జరిపిన సాయిసూర్య డెవలెపర్స్, సురానా గ్రూప్స్ కు సంబంధించిన యాడ్స్ లో ఆయన పాల్గొన్నారు. అందుకు ఆయన దాదాపు యాభై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో మూడున్నర కోట్ల రూపాయల నగదు, మిగిలిన మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసింది. అయితే దీనికి సంబంధించిన వివరాలను అడిగేందుకే మహేశ్ బాబును ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. సురానా గ్రూపు, సాయి సూర్య డెవలెపర్స్ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నించనున్నారు. దీనికి మహేశ్ బాబు నేడు విచారణకు రాలేనని లేఖ రాశారు.
Next Story

