Fri Dec 05 2025 13:43:59 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డి వివరణ ఇవ్వకుంటే?
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలంగాణ రాజకీయాలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలంగాణ రాజకీయాలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ రేఖ ఎవరు దాటినా వారిపై చర్యలుంటాయని జైరాం రమేష్ అన్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చామని, సమాధానం రాకుంటే చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
చర్యలు తప్పవు...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ పంపితే దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే తప్ప సమాధానం రాకుంటే చర్యలు తప్పకుండా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎవరైనా పార్టీ ఆదేశాలు, నిబంధనల మేరకే నడుచుకోవాల్సి ఉంటుందని జైరాం రమేష్ అన్నారు.
Next Story

