Wed May 08 2024 08:18:34 GMT+0000 (Coordinated Universal Time)
సిట్ ఎదుటకు నేడు రేవంత్
టీఎస్పీఎస్సీ పరీక్ష లీకేజీ అంశంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎదుటకు నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్ష లీకేజీ అంశంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఎదుటకు నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు గతంలోనే రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ కు సమర్పించాలని కోరారు.
ఆధారాలను...
రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి చెందిన సొంత ఊళ్లో వంద మందికి పైగా వంద మార్కులు వచ్చాయని విమర్శించిన నేపథ్యంలో ఆయనకు సిట్ ఈ నోటీసులు జారీ చేసింది. తాను సిట్ ఎదుట హాజరవుతానని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనను రేపు హాజరు కావాలని సిట్ అధికారులు కోరారు.
Next Story