సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారని, కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు.రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారన్న రేవంత్ రెడ్డి రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని చెప్పారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందని, రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లారని, అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు.

