Tue Apr 07 2026 13:16:48 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : హైస్పీడ్ రైల్ కారిడార్ పై సీఎం సమీక్ష
హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు

హైదరాబాద్ - బెంగళూర్, హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను రైల్వే శాఖ రైట్స్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పజెప్పింది.
పలు సూచనలు చేసి...
ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అలైన్మెంట్లు, డీపీఆర్కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు , సెక్రటరీ కో ఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ లలిత్ కుమార్ పాల్గొన్నారు.
Next Story

