Sun Feb 09 2025 21:51:09 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్.. రేపు వారికి రుణమాఫీ
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. అయితే రేపు లక్షన్నర రూపాయల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమయింది. రేపు అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 15వ తేదీ లోపు....
ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని ప్రకటించిన రేవంత్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ిఇందులో భాగంగానే ఇప్పటి వరకూ కొందరు రైతులకు రుణమాఫీ చేశారు. రేపు లక్షన్నర రూపాయల రుణం తీసుకున్న వారి రుణాలను మాఫీ చేయనున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీపై చర్చ పెట్టే అవకాశముందని తెలిసింది.
Next Story