Thu Mar 19 2026 08:53:01 GMT+0530 (India Standard Time)
DSC TET Notification : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మూడు లక్షల మందికి
తెలంగాణలో యువకులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది.

DSC TET Notification :తెలంగాణలో యువకులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీకి ముందేద టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో మూడు లక్షల మంది యువతీ యువకులు ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టెట్ నిర్వహించాలని...
డీఎస్సీ నిర్వహించాలని ఇది వరకే నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా టెట్ పరీక్షను కూడా నిర్వహించాలని నిర్ణయిండం నిజంగా నిరుద్యోగులకు గుద్ న్యూస్ వంటిదే. చాలా కాలం నుంచి టెట్ పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

