Thu May 22 2025 06:59:12 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : ప్రమాదకరమైన జోన్ లోకి సహాయక బృందాలు.. ఇక త్వరలోనే?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలయి నేటికి 57వ రోజుకు చేరుకుంది. టన్నెల్ లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకుంటున్నాయని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి ముగింపు పలుకుతామని అధికారులు, సహాయక బృందాలు ధీమాగా ఉన్నాయి. మృతదేహాలను ఆరింటిని వెలికితీసే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని, ప్రమాదకరమైన జోన్ లో చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ ఉన్న మట్టిని, బురదను, వేస్ట్ మెటీరియల్ ను జాగ్రత్తగా తొలిగిస్తున్నామని తెలిపారు.
డీ 2 ప్రాంతంలో...
ముఖ్యంగా డీ2 ప్రాంతంలో పేరుకుపోయిన పెద్ద పెద్ద బండరాళ్లను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. మృతదేహాలు దాదాపు తొమ్మిది అడుగులకు పైగానే లోపల కూరుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తొమ్మిది అడుగులకు పైగానే బురదను తొలగించాని, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశముందని కూడా సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. వీలయినంత మేరకు త్వరగా బురదను తొలగిస్తే మృతదేహాలు లభ్యమవుతాయని భావిస్తున్నారు.
లోకో ట్రెయిన్ ద్వారా...
టీబీఎం శకలాలను కూడా తొలగిస్తున్నారు. వాటిని కట్ చేసుకుంటూ చిన్నచిన్న ముక్కలుగా చేసి టన్నెల్ బయటకు తరలిస్తున్నారు. వీటిని లోకో ట్రెయిన్ ద్వారా బయటకు తీసుకు వస్తున్నారు. మొత్తం పన్నెండు బృందాలు నిర్విరామంగా మూడు షిఫ్ట్ లలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. టన్నెల్ లోపలకి ఆక్సిజన్ ను పంపి సహాయక బృందాలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమవ్వడంతో మిగిలిన వాటి కోసం తీవ్రంగా సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.
గొయ్యి పూడ్చివేతకు...
మరొక వైపు శ్రీశైలం ప్రాజెక్ట్లో గొయ్యి పూడ్చివేతకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, గొయ్యి పూడ్చివేత బాధ్యతను షనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి అప్పగించింది. ఈనెల 28న విజయవాడకు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ రానున్నరు. 29న శ్రీశైలం ప్రాజెక్ట్ పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ బృందం పర్యటించనుంది. 30వ తేదీన తెలంగాణ అధికారులతో సమావేశంకానున్న బృందం గొయ్యి పూడ్చివేతపై చర్చించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీశైలం టన్నెల్ ప్రాంతానికి మిషనరీ చేరుకుంది.
Next Story