Fri May 23 2025 02:50:02 GMT+0000 (Coordinated Universal Time)
SlBC Accident : తవ్వకాలకు ఇంకా సమయం ఉందట.. ప్రస్తుతం టన్నెల్ లో ఏం జరుగుతుందంటే?
శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేటికి సహాయక చర్యలు యాభై ఐదు రోజులకు చేరుకున్నాయి. సొరంగంలోపల నిన్నటి నుంచి తవ్వకాలు ప్రారంభమయినట్లు అక్కడ సహాయక పనులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు తెిపారు. సొరంగం లోపు బండరాళ్లు, బురదను, టీబీఎం మిషన్ శిధిలాలను తొలగించే ప్రక్రియలో కూడా వేగం అందుకుంది. ఎప్పటికప్పుడు సహాయక బృందాలతో సమీక్షలు జరుపుతూ చర్యలు తీసుకుంటున్నారు. మరో ఆరుగురి మృతదేహాలను వెలికి తీసేంత వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా లేవు.
సహాయక బృందాలు...
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వేతో పాటు అనేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చి యాభై నాలుగు రోజు ల నుంచి ఇక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ ఆపరేషన్ ను వీలయినంత మేరకు త్వరగా పూర్తి చేయాలన్న ఛాలెంజ్ ను తీసుకుని పనిచేస్తుంది. అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. అత్యాధునిక పరికరాలను ఉపయోగించి టన్నెల్ లో పనులు చేపట్టారు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రమాదం జరిగి యాభై ఐదు రోజులు అవుతుండటంతో బతికే ఛాన్సే లేదు. కనీసం మృతదేహాలు పాడయి పోకముందే వాటిని బంధువులకు అప్పగించాలన్న ఉద్దేశ్యంతో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.
ఇంకా తవ్వాల్సి ఉంది....
మరో యాభై మీటర్ల పొడవు, మూడు మీటర్ల ఎత్తులో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ ను సిద్ధం చేయడంతో మట్టిని, బండరాళ్లను వేగంగా బయటకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే టీబీఎం మిషన్ శకలాలను కూడా జాగ్రత్తగా బయటకు తీసుక వస్తును్నారు. దీనికి లోకో ట్రైన్ ను ఉపయోగిస్తున్నారు. లోపల ఉన్న నీటిని తొలగించే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పనుల పరోగతిపై అప్ డేట్ ఇస్తున్నామని, వారి నుంచి సలహాలు తీసుకోవడమే కాకుండా, నిపుణుల సూచనల మేరకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు.
Next Story