Wed May 21 2025 04:24:38 GMT+0000 (Coordinated Universal Time)
Train Robbery : ఆగి ఉన్న రైళ్లలో దోపిడీ.. బంగారం ధరలు పెరగడంతోనే దోపిడీ దొంగల కన్ను ఏసీ బోగీలపైన?
ఇటీవల రైళ్లలో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. బంగారాన్ని దోచుకెళుతున్నారు

ఇటీవల రైళ్లలో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో గోల్డ్ కోసం దుండగులు రైళ్లను ఎంచుకుంటున్నారు. ఇటీవల వరసగా మూడు రైళ్లలో దోపిడీలు జరగడంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల గోదావరి ఎక్స్ ప్రెస్ లో చోరీ జరగగా, రాయలసీమ ఎక్స్ ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లోనూ దోపిడీ జరిగింది. ఏసీ బోగీలను దుండగులు లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఏసీ బోగీల్లో అయితే విలువైన బంగారు ఆభరణాలుంటాయని భావించి అక్కడ దోపిడీకి దిగుతున్నారు. ఏసీ టూ టైర్, త్రీ టైర్ లలో ఎక్కువగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. రైల్వే పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నా పలితం కనిపించడంలేదు.
గోదావరి ఎక్స్ ప్రెస్ లో...
ఎక్స్ ప్రెస్ రైళ్లు సిగ్నల్ కోసం కొన్ని స్టేషన్లలో ఆగాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. గోదావరి ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది.గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చిన గోదావరి ఎక్స్ ప్రెస్ లో బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ లోని ఏ1 కోచ్లో 11 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు వాటిని కాజేసి తప్పంచుకుని పారిపోయారు. దీంతో బంగారం కోల్పోయిన ప్రయాణకులు లబోదిబోమంటున్నారు. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గోదావరి ఎక్స్ప్రెస్ లో ఈ చోరీ జరిగింది. రైలు ఆగిన సమంయంలో గోదావరి ఎక్స్ ప్రెస్ లోకి ప్రవేశించిన దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో...
అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ ప్రెస్లో దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. గుత్తి వద్ద ఆగి ఉన్న రైలులోకి చొరబడిన ఐదుగురు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అమరావతి ఎక్స్ ప్రెస్ లైన్ క్లియర్ కోసం రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను స్టేషన్ లో నిలపడంతో దుండగులు రైలులోకి ప్రవేశించారు. మొత్తం పది బోగిల్లో దోపిడీకి పాల్పడ్డారు. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ ప్రెస్లో ఈ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్కు లైన్క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ప్రెస్ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులో దోపిడీకి పాల్పడ్డారు.
నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో...
అలాగే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో కూడా దొంగతనాలు జరిగాయి. కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య గురువారం తెల్లవారు జామున ఆగి ఉన్న రైలులోకి దొంగలు ప్రవేశించారు. ఎస్3, ఎస్ 4 బోగీల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్శ్రీవెంకటేశ్వరపాలెం స్టేషన్ సమీపంలో ఆగిన సమయంలో ఎస్ 3లో నిద్రిస్తున్న వారి నుంచి మూడు తులాల బంగారాన్ని అపహరించారు. ఇలా రైళ్లలో వరస దోపిడీలకు పాల్పడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రయాణికులకు తగిన రక్షణ కల్పించాలని, ప్రధానంగా రైలు ఆగిన సమయంలో రై్ల్వే పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇకపై రైళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన భద్రత ప్రయాణికులకు కల్పించాలని కోరుతున్నారు.
Next Story