Fri May 23 2025 02:31:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ జీబీఎస్ కేసు కలకలం
ఇటీవల మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసు హైదరాబాద్ లోనూ నమోదయియింది.

ఇటీవల మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసు హైదరాబాద్ లోనూ నమోదయియింది. దీంతో అధికారులు అప్రమత్తమమయ్యారు. జీబీఎస్ కేసు సిద్ధిపేట మండలానికి చెందిన మహిళకు సోకినట్లు తెలిపారు. ఈ మేరకు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ప్రయివేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుందని తెలిపారు. మహారాష్ట్రలోని పూనేలో ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయి. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే జీబీఎస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధిలక్షణాలు...
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి ఒళ్లంతా తిమ్మరిగా అనిపించడతో పాటు కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. అయితే భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
Next Story