Raithu Bharosa : భరోసా రైతుకు ఎప్పుడు... ముహూర్తం నిర్ణయించారటగా?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది. పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా నిధులు డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఎప్పుడంటూ రైతులు ఆశతో ఎదురు చూసతున్నారు. . మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరగగా, 13వ తేదీన కౌంటింగ్ జరిగింది. 16,17తేదీల్లో గెలిచిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. దీంతో మంగళవారం నాటికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం.

