Wed Dec 17 2025 14:11:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తెలంగాణలో నిరసనలు.. మోదీ వ్యాఖ్యలకు
రాష్ట్ర విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలను రేపాయి.

రాష్ట్ర విభజన అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలను రేపాయి. మోదీ వ్యాఖ్యలను అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ లు అభ్యంతరం తెలుపుతున్నాయి. తలుపులు మూసి, పెప్పర్ స్ప్రే లు చల్లి రాష్ట్ర విభజన చేశారని, ఏపీకి అన్యాయం జరిగిందని, హడావిడిగా రాష్ట్ర విభజనను కాంగ్రెస్ చేసిందన్న వ్యాఖ్యలు చేశారు.
మోదీ వ్యాఖ్యలకు...
నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు నేడు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమం చేపట్టనున్నాయి.
Next Story

