Thu Feb 13 2025 04:04:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ మృత్యుంజయ హోమం
ప్రధాని మోదీ భద్రతా లోపం, ఆయన ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి.

ప్రధాని మోదీ భద్రతా లోపం, ఆయన ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నేడు మృత్యుంజయ హోమాలు జరుగుతాయి. ప్రధాని ఆయురోరాగ్యాలతో ఉండాలని ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు.
ఆయురారోగ్యంతో ఉండాలని...
హైదరాబాద్ లోని అలకాపురిలోని శృంగేరి పీఠంలో జరిగే మృత్యుంజయ హోమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఈ హోమాలు జరగనున్నాయి.
Next Story