Fri Dec 05 2025 19:54:02 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ పై పోలీసు కేసు నమోదు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ నెల 6న ట్విట్టర్ లో అయోధ్యపై పోస్ట్ చేశారు. దీనిపై వివరణ కోరుతూ పోలీసులు ఇటీవల రాజాసింగ్ కు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే హైకోర్టు షరతులను ఉల్లంఘించారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు రాజాసింగ్ తరుపు న్యాయవాది పోలీసులకు వివరణ కూడా ఇచ్చారు.
ఒవైసీ సోదరులపై....
అయితే ఈ వివరణతో సంతృప్తి చెందలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో రాజాసింగ్ పై మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. బాబ్రీ మసీదుపై ఒవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు తనపై కక్ష కట్టి వరసగా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.
Next Story

