Sun May 05 2024 13:53:07 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ "యాత్ర" ఎప్పటి నుంచి అంటే?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు పీసీసీ పోస్టర్ విడుదల చేసింది
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు పీసీసీ పోస్టర్ విడుదల చేసింది. జనవరి 26వ తేదీ నుంచి జూన్ రెండో తేదీ వరకూ పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించనున్నారు.
జోడోకు కొనసాగింపుగా...
ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్చార్జులు ఈ యాత్రను చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు పీసీసీ సమావేశమై పాదయాత్రపై దిశానిర్దేశం చేశారు.
Next Story