Sat Dec 06 2025 20:28:01 GMT+0000 (Coordinated Universal Time)
రేపు చార్మినార్ వద్ద కలుద్దాం
రేపటి భవిష్యత్ కోసం రాహుల్ గాంధీతో కలసి అందరం నడుద్దామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

రేపటి భవిష్యత్ కోసం రాహుల్ గాంధీతో కలసి అందరం నడుద్దామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు వేయాలన్నారు. రాహుల్ కు మద్దతుగా నిలుద్దామని కోరారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక కిలోమీటర్ అయినా నడవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాజకీయాలకు అతీతంగా...
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. నవంబరు 1వ తేదీ సాయంత్రం చార్మినార్ వద్ద అందరం కలుద్దామని ఆయన పిలుపు నిచ్చారు. ఎనిమిదేళ్ల నుంచి టీఆర్ఎస్ అరాచకాలకు బేజీపీ వంతపాడిందని రేవంత్ రెడ్డి ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో కోరారు.
Next Story

