Thu Dec 18 2025 13:35:30 GMT+0000 (Coordinated Universal Time)
పల్లె రవికి నామినేటెడ్ పదవి
కల్లు గీత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవికుమార్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ కల్లు గీత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవికుమార్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పల్లె రవి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. మునుగోడులో బీఆర్ఎస్ విజయానికి పల్లె రవి చేరిక కొంత ఉపయోగపడిందని కేసీఆర్ భావిస్తున్నారు.
కేసీఆర్ను కలసి...
ఈ నేపథ్యంలో పల్లె రవికుమార్ ను నామినేటెడ్ పదవిలో నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిన్న పల్లె రవికుమార్ దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో కల్లు, గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్లె రవికుమార్ తెలిపారు.
Next Story

