Thu Dec 18 2025 05:15:26 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క చేప 22.5 కిలోలు.. దశ తిరిగింది
నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ చేపలు వలలకు చిక్కుతూ ఉన్నాయి.

నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ చేపలు వలలకు చిక్కుతూ ఉన్నాయి.పెద్దూరుకు చెందిన జి.ముత్యాలు వలకు ఏకంగా 22.5 కిలోల బరువైన బొచ్చె రకం చేప చిక్కింది. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. గతంలో 18 కిలోల చేప పడగా.. ఇప్పుడు ఈ చేప ఆ రికార్డును బద్దలు కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఒకే ఒక్క చేప ద్వారా వేల రూపాయల ఆదాయం మత్య్సకారులకు లభిస్తూ ఉన్నాయి. జలాశయాల్లో చేపల సంపద పెరగడం, స్థానిక మత్స్య పరిశ్రమ వృద్ధి చెందడంతో ఎన్నో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలుతున్నాయి.
Next Story

