Sun May 05 2024 19:45:10 GMT+0000 (Coordinated Universal Time)
విచారణకు రఘురామ రావడం లేదట
ఎమ్మెల్యే ఎర కేసులో విచారణకు నేడు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు హాజరు కావడం లేదు
ఎమ్మెల్యే ఎర కేసులో విచారణకు నేడు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు హాజరు కావడం లేదు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం 41 ఎ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు రఘురామ కృష్ణరాజు కు తెలిపారు. ఈ మెయిల్ ద్వారా ఆయనకు ఈ మేరకు సమాచారం పంపారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో...
రఘురామ కృష్ణరాజు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వంద కోట్లు ఇస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను విచారించాలని సిట్ భావించింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని కోరింది. కానీ కారణాలేంటో తెలియదు కాని ఈరోజు విచారణకు అవసరం లేదని, తాము మరోసారి పిలిచినప్పుడు మాత్రం హాజరు కావాలని సిట్ ఈ మెయిల్ ద్వారా రఘురామ కృష్ణరాజుకు తెలిపింది.
Next Story