Sat Mar 07 2026 21:55:31 GMT+0530 (India Standard Time)
కోతుల దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి టేకులపల్లి మోడల్ స్కూల్ లో కోతుల బీభత్సం సృష్టించాయి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి టేకులపల్లి మోడల్ స్కూల్ లో కోతుల బీభత్సం సృష్టించాయి. కులపల్లి మోడల్ స్కూల్ లో ఇద్దరి విద్యార్థులపై కోతులు దాడి చేశాయి. దీంతో విద్యార్థులు భయపడి మెట్లపై నుండి విద్యార్థినులు దూకారు. దీంతో ఇద్దరి విద్యార్థులకు గాయాలయ్యాయి
ఆసుపత్రిలో చికిత్స...
వారికి పెనుబల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోతుల సంచారం ఎక్కువగా ఉందని అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు గాయాలపాలయ్యారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో కోతుల బెడద నుంచి రక్షించాలని పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Next Story

