Sun Mar 08 2026 02:58:20 GMT+0530 (India Standard Time)
మంత్రి కేటీఆర్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం రేగిన గాలిదుమారానికి..

వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆయన అక్కడకు చేరుకోడానికి గంట ముందు ప్రమాదం జరిగింది.
బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బుధవారం మధ్యాహ్నం రేగిన గాలిదుమారానికి ఈ ప్రమాదం జరిగింది. గాలుల ధాటికి కేటీఆర్ బహిరంగసభ టెంట్లు కూలిపోయాయి. కేటీఆర్ సభకు రాకముందే ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బహిరంగసభ మొదలయ్యాక ఈ ప్రమాదం జరిగి ఉంటే.. కేటీఆర్ సహా.. చాలా మంది నేతలు, భారీ సంఖ్యలో హాజరైన ప్రజలపై టెంట్లు కూలి గాయాలపాలయ్యేవారు.
Next Story

