Wed Jan 21 2026 00:39:09 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం
గురువారం జీవన్ రెడ్డి గుండెపోటుతో కుప్పకూలగా.. వెంటనే కంచన్ బాగ్ లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రికి

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి(50) గుండెపోటుతో కన్నుమూశాడు. గురువారం జీవన్ రెడ్డి గుండెపోటుతో కుప్పకూలగా.. వెంటనే కంచన్ బాగ్ లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మరణించారు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
మంత్రి కిషన్ రెడ్డి అక్క లక్ష్మి- బావ నర్సింహారెడ్డిల కుమారుడే జీవన్ రెడ్డి. అతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మేనల్లుడి మరణవార్త విని నోయిడాలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం. కాగా, జీవన్ రెడ్డి అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story

