Summer Effect : ఇప్పటి వరకు ఒక లెక్క ..మార్చి నుంచి మరొక లెక్క
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవత్ర 35 డిగ్రీలు నమోదైనా మార్చి మొదటి వారం నుంచి 40 డిగ్రీలు దాటే అవకాశలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి కరువు వచ్చే అవకాశలు ఉన్నాయని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. పడాల్సిన సమయంలో వానలు పడకపోవడం రైతులకు కష్టాలు అతి దగ్గరలోనే వున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలినినో ప్రభావం తో వర్షాలు చాలా చాలా తక్కువ గా అంటే సాధారణ కంటే తక్కువ గా నమోదవుతాయని పేర్కొంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఏండల తీవత్ర ఉంటుంది. ముఖ్యం గా వృద్ధులు, పిల్లల జాగ్రత్త లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఏండల తీవత్ర నుంచి తగిన జాగ్రత్త లు తీసుకోవాలి. 50 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు వున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

