Tue Jan 20 2026 18:31:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : ఈవీఎంల మొరాయింపు.. వేచి చూస్తున్న సెలబ్రిటీలు
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రాంతంలో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. హైదరాబాద్ లో మాత్రం కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రాంతంలో సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
పలు చోట్ల...
అల్లు అర్జున్ ఓటు వేసే కేంద్రంలోనూ, జూనియర్ ఎన్టీఆర్ వేచి చూస్తున్న పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలు కొంత పనిచేయకపోవడంతో సాంకేతిక సిబ్బంది వచ్చి వాటిని సరిచేసే పనిలో పడ్డారు. క్యూ లైన్లు పెద్దగా లేకపోయినప్పటికీ ఈవీఎంలు మొరాయించడంతో సినీ సెలబ్రిటీలు క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story

