Telangana : ముగ్గురి వద్దనే వెయ్యి కోట్లా... వీళ్లు దొరికినోళ్లు... దొరకనోళ్లు ఇంకెంత మందో?
కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు వరంగా మారింది

కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు వరంగా మారింది. కోట్ల రూపాయల నిధులను కూడబెట్టారనడానికి ఏసీబీ గత కొంతకాలంగా జరుపుతున్నదాడులతో స్పష్టమవుతుంది.ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులందరూ కోట్లు కూడబెట్టుకున్నారు. దీన్ని బట్టిచూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కాసుల వర్షం కురిపించిందని ఏసీబీ దాడుల ద్వారా అర్థమవుతుంది. ఇప్పటి వరకూ ముగ్గురు నీటి పారుదల శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురి నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కనుగొన్నారంటే ఏ రేంజ్ లో అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతుంది. ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, విల్లాలు, ఖరీదైన కార్లు, బంగారం, వెండి ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో సంపాదించారంటే కాళేశ్వరం ఎంత వరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

