Mon Feb 02 2026 00:04:34 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది.

నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.
ప్రత్యేక అతిధిగా...
ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా కాకతీయ 22వ తరం వారసుడైన కమల్ చంద్ర భంజ్దేవ్ రానున్నారు. ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. ఛత్తీస్ఘడ్ లోని బస్తర్ నుంచి ఆయన వరంగల్ కు రానున్నారు. కాకతీయ సమ్మేళనం సందర్భంగా కవి సమ్మేళనాలు, వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు.
Next Story

