Thu Jan 29 2026 05:35:01 GMT+0000 (Coordinated Universal Time)
జన్వాడ ఫామ్ హౌస్లో కొలతలు వేస్తున్న అధికారులు
జన్వాడ ఫామ్ హౌస్ కు నీటిపారుదల శాఖ అధికారులు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది

జన్వాడ ఫామ్ హౌస్ కు నీటిపారుదల శాఖ అధికారులు చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. అక్కడకు చేరుకున్న ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. జన్వాడ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగా ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్ మాత్రం అది తన స్నేహితుడదని, తాను లీజుకు తీసుకున్నానని చెప్పారు.
ఇరిగేషన్ అధికారులు...
దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే హైడ్రా అధికారులు కాకుండా ఇరిగేషన్ అధికారులు అక్కడకు రావడం చర్చనీయాంశమైంది. కొలతలు వేసిన తర్వాత నిబంధనలు అతిక్రమించి నిర్మించారా? లేదా? అన్నది తేలనుంది.
Next Story

