Sun Mar 15 2026 09:35:23 GMT+0530 (India Standard Time)
Medigadda : నేటి నుంచి విచారణ ప్రారంభం
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభం కానుంది

నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు లో పిల్లరు కుంగిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
జస్టిస్ పినాకీ ఘోష్...
దీనిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి ఘోష్ విచారణ జరపనున్నారు. నేటి నుంచి విచారణ జరపపున్నారు. నిన్ననే పినాకీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలతో పాటు, మేడిగడ్డ కుంగిపోవడంపై పరిశీలన చేసి ఈ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
Next Story

