Fri Dec 05 2025 23:23:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మహాయాగానికి అంకురార్పణ
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది.

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. ఇందులో కీలక ఘట్టమైన పంచనారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి నేడు అంకురార్పణ జరగనుంది. ఇందుకోసం యాగశాలలో పంచకుండాలను సిద్ధం చేశారు. ఉదయం 9గంటలకు పూజతో ఈ కార్యక్రమం ప్రాంరంభం కానుంది. బాలాలయంలో అష్టోష్టత్తర శతఘటాభిషేకాన్ని మహారాజాభిషేకంగా నిర్వహిస్తారు.
108 కలశాలతో......
108 కలశాలతో దేవతారాధనలను జరిపి విశిష్ట అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ యాగాన్ని సామాన్య భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ యాగం కోసం 108 మంది పారాయణికులను రప్పించారు. నేటి నుంచి యాదాద్రికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేపట్టారు.
Next Story

