Mon May 13 2024 15:25:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇప్పటి వరకూ 63 కోట్ల నగదు స్వాధీనం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వీరు ఇప్పటి వరకూ 63 కోట్ల రూపాయల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. లెక్కలు చూపించకుండా తీసుకెళుతున్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. పట్టుబడిన నగదుకు లెక్కలు చూపితే తిరిగి ఆ సొమ్మును తీసుకునే అవకాశముంది.
104 కోట్ల విలువైన...
మరోవైపు లిక్కర్ కూడా భారీగానే స్వాధీనం చేసుకున్నారు. 104 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్ స్వాధీనంచేసుకున్నారు. లైసెన్స్ లేని పథ్నాలుగు గన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషనర్ అధికారులు తెలిపారు. కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.న్యాయస్థానంలో హాజరుపర్చగా కొందరికి రిమాండ్ విధించారని తెలిపారు.
Next Story