Wed Mar 18 2026 06:47:05 GMT+0530 (India Standard Time)
నార్కెట్పల్లి వద్ద రూ. 23 లక్షలతో ఉన్న బ్యాగ్ చోరి
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రూ. 23 లక్షల నగదు చోరీకి గురైన ఘటన కలకలం రేపింది.

నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద రూ. 23 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ అదృశ్యం కావడం కలకలం రేపింది. ప్రయాణంలో ఉన్న సమయంలో డబ్బుతో ఉన్న బ్యాగ్ మాయమైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, బ్యాగ్ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మిగతా ప్రయాణికులను, సిబ్బందిని విచారిస్తున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను ఖచ్చితంగా తమ దగ్గరే ఉంచుకోవాలని సూచించారు.
Next Story

