Wed Mar 11 2026 11:47:06 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ
నేడు వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ జరగనుంది

నేడు వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్లపట్టాల పంపిణీ జరగనుంది. ఖమ్మం కలెక్టరేట్లో 311 మందికి ఇళ్ల పత్రాలను పంపిణీ చేయనన్నారు. మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కూడా అందచేస్తారు. బాధితులకు ఇళ్ల పట్టాలను పట్టాలు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పంపిణీ చేయనున్నారు.
తొలగించిన వారికి...
ఇటీవల భూదాన్ భూముల్లో ఇళ్లను తొలగించిన బాధితుల్లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూదాన్ భూముల్లో ఏళ్ల తరబడి నివాసముంటున్నవారిని తొలగించడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.ఈరోజు అర్హులైన లబ్దిదారులందరికీ పట్టాలు పంపిణీ చేయడనుంది.
Next Story

