Fri Dec 05 2025 14:29:11 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్కు బాలకృష్ణకు మాస్ వార్నింగ్
బీఆర్ఎస్పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు

తెలంగాణ నేతలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మూడు రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని బాలయ్య బాబు ఫైర్ అయ్యారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగించారు.
తాను అండగా ఉంటా...
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తాను అండగా ఉంటానని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ పై కొందరు వెంటనే స్పందించలేదని పరోక్షంగా బీఆర్ఎస్ పై బాలకృష్ణ విమర్శలు చేశారు. తాను ఇక్కడే ఉండి పార్టీని రక్షించుకుంటానని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్ట్పై స్పందించినా, ఎన్టీఆర్ జపం చేసినా ఎటువంటి లాభం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

