Thu Feb 05 2026 02:19:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో ఊరట
తెలంగాణలో భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చెప్పింది

తెలంగాణలో భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ చెప్పింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై దాఖలయిన పిటీషన్లపై విచారించిన హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. ప్రభుత్వం తమ భూములను విక్రయించడానికి అభ్యంతరం చెప్పలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ నేత విజయశాంతి ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.
భూముల విక్రయానికి...
భూముల విక్రయంలో ప్రభుత్వ టెండర్లు, ఈ వేలం వంటి పారదర్శక విధానాలను అవలంబించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం భూములను విక్రయిస్తూ ప్రజల ఆస్తులను కరిగించేస్తుందని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు పిటీషన్ ను కొట్టివేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
Next Story
