Sat Apr 27 2024 09:33:54 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి కోర్టు అంగీకరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి కోర్టు అంగీకరించింది. రాష్ట్రంలో సీబీఐని ప్రభుత్వం నిషేధించినా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ ఈ కేసును విచారించ వచ్చని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసు విచారణను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంకు అప్పగించింది.
అప్పీల్ కు వెళ్లే అవకాశం....
సిట్ దర్యాప్తు ఏకపక్షంగా కొనసాగుతుందని సిట్ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీల్ కు వెళ్లనుందని తెలిసింది. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎరవేస్తూ నలుగురు నిందితులు మొయినాబాద్ ఫాంహస్ లోప్రయత్నించిన సంగతి తెలిసిందే.
Next Story