Sun Mar 15 2026 20:19:42 GMT+0530 (India Standard Time)
హైకోర్టులో నేడు వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ మాత్రం ఇప్పటి వరకూ దొరకలేదు.
అరెస్ట్ చేయడానికి...
అయితే ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. దీంతో వల్లభనేని వంశీ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ వల్లభనేని వంశీకి వస్తే ఆయన ఎక్కడ ఉన్నది తెలియనుంది.
Next Story

