Sun Mar 15 2026 15:04:21 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు
తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి.

తెలంగాణలో మూడో రోజు గ్రామ సభలు జరుగుతున్నాయి. రేపటితో గ్రామసభలు ముగియనుండటంతో అనేక ప్రాంతాల్లో నేడు, రేపు గ్రామసభలను జరిపినాలుగు పథకాలకు సంబంధించిన అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఈ నెల 21 నుంచి గ్రామసభలు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
దరఖాస్తుకు సమయం...
ఈ గ్రామ సభల్లోనే అర్హులైన లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తున్నారు. అర్హులైన అందరికీ అవకాశం ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతుంది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకించి సమయం ఏదీ లేదని, రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మూడో రోజు గ్రామసభల్లో ప్రజలు ప్రశ్నించే అవకాశముండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story

