Thu Jan 29 2026 08:53:43 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సీఎస్ గా శాంతికుమారి
తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా శాంతికుమారిని ప్రభుత్వం నియమించనుంది. కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి

తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా శాంతికుమారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ మేరకు కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. శాంతికుమారిని చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేస్తే 2025 ఏప్రిల్ వరకూ ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతలో ముఖ్యమంత్రి కార్యాలయంలో శాంతికుమారి పనిచేశారు.
రెండేళ్లపాటు...
హైకోర్టు ఆదేశాలలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ స్థానంలో తెలుగువారిని నియమించాలని కేసీఆర్ భావించారు. ఇందుకోసం శాంతికుమారి, రామకృష్ణారావు పేర్లు ప్రముఖంగా విన్పించాయి. చివరకు మహిళ కావడం, సీఎం కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉండటంతో 989 బ్యాచ్ కు చెందిన శాంతికుమారి వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపినట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story

