Fri Dec 05 2025 16:44:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు సెలవులు
తెలంగాణలో విద్యార్థులకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది

తెలంగాణలో విద్యార్థులకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. విద్యాసంస్థలకు మూడు రోజలు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన శివరాత్రికి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 24 జిల్లాల్లో ఈ సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది.
వరస సెలవులతో...
తిరిగి మార్చి మూడో తేదీన కౌంటింగ్ ఉండటంతో ఆరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 24 జిల్లాలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని, మిగిలిన జిల్లాల్లో 26వ తేదీ ఒక్కరోజు మాత్రమే విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని తెలిపారు.
Next Story

